సిరా న్యూస్, హుస్నాబాద్
బీజేపీలో చేరిన ఎల్కతుర్తి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు
* పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్కుమార్
* చక్రం తిప్పిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో ఎల్కతుర్తి మండలంలోని తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, పలువురు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో మంగళవారం చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మార్చిందని అన్నారు. మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారని,రానున్న ఎంపీ ఎన్నికలలో బండి సంజయ్ కుమార్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని అన్నారు.అనంతరం భారతీయ జనతా పార్టీలో అరెపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బూర్గుల రామారావు,ఎల్కతుర్తి గ్రామ మాజీ సర్పంచి నిరంజన్ రెడ్డి, చింతలపల్లి గ్రామ మాజీ సర్పంచి కుడుతాడి అనిత-రాజు,గోపాలపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భాస్కర్ రావు, పెంచికలపేట గ్రామ మాజీ సర్పంచ్ సమాల జమునా-సురేష్ రెడ్డి,తిమ్మాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ చిట్టిబాబు, వల్భాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ అంబాల మమత-ప్రతాప్,గుంటూరుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సూదిరెడ్డి అశోక్, దామెర గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్మిడి లచ్చిరెడ్డి, ఆరెకుల సంఘం జిల్లా కార్యదర్శి అంబిరు శ్రీనివాస్, దామెర గ్రామ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సంగ రమేష్ యాదవ్, దామెర గ్రామ మాజీ వార్డు సభ్యులు అవుల రాజు, పలువురు సీనియర్ నాయకులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ లక్ష్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి, నాయకులు జనగాణి కిష్టయ్య, పల్లెపాటీ మధుకర్, చిదురాల వెంకటేష్, ఆరేపల్లి వినోద్, మంతూర్తి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.