సిరా న్యూస్, శంకరపట్నం:
శంకరపట్నంలో విద్యాసంస్థలు బంద్ విజయవంతం
శంకరపట్నం మండల కేంద్రంలో గురువారం విద్యాసంస్థలు బంద్ విజయవంతమైంది. ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఎఫ్ మండల ప్రెసిడెంట్ మహమ్మద్ ఆయాన్, కనకం సాగర్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్ పై జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జిలతో విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అమీర్, అఫిజ్, ఆదిత్య, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.