Santosh Kumar: మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాలి

సిరా న్యూస్, భీమదేవరపల్లి
మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాలి
* స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కుమార్
* పలువురు మహిళలకు ఘ‌న స‌న్మానం
మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించాల‌ని స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న పలువురు మహిళలను గురువారం భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామ స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లారం సబ్ సెంటర్ ఏఎన్ఎం గీత, ఆశా కార్యకర్తలు ఎలీషా, భాగ్యలక్ష్మి, రాధిక, ఎంపీటీసీ గుగులోత్ లలిత శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ రాధిక, ప్రైమరీ స్కూల్ టీచర్ కవిత, అంగన్వాడి టీచర్ శోభారాణి, విఓలు నీలం శోభా, సంధ్యరాణి, అనిత గ్రామ పంచాయతీ సిబ్బంది పట్ల ఎల్లమ్మ తదితరులను స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ శాలువాతో సత్కారించి, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ గ్రామపంచాయతీ సెక్రటరీ రాజు, గ్రామపంచాయతీ సిబ్బంది నీలం కుమార్, గంగారపు మహిబాబు తదితరులు పాల్గొన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *