Santosh Singh: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావ‌డం ఖాయం: మండల అధ్యక్షులు సాబ్లే సంతోష్ సింగ్

సిరాన్యూస్, నేర‌డిగొండ‌
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావ‌డం ఖాయం: మండల అధ్యక్షులు సాబ్లే సంతోష్ సింగ్
* గ్రామాల్లో బీజేపీ నాయ‌కుల ఇంటింటా ప్ర‌చారం

మరోమారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, ప్రజలందరూ మోడీని ప్రధానమంత్రిని చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్నారని బీజేపీ మండల అధ్యక్షులు సాబ్లే సంతోష్ సింగ్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని మాదాపూర్, వెంకటపూర్, కుంటాల – బి, కుంటాల – కే గ్రామాలలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మరో మారు మోదీయే రావాల‌ని ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారని, బీజేపి ఎంపీ అభ్యర్థి గొడం నగేష్ ను భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాములు, పరుశురాం, నారాయణ, వెంకటేష్, భీంరావ్, శంకర్, మహేందర్ రెడ్డి, అడెపు నరేందర్, రమణ, క్రిష్ణ, ఉత్తం, రాజేశ్వర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *