సిరా న్యూస్, సైదాపూర్
వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించండి
* కాంగ్రెస్ సీనియర్ నాయకులు సారబుడ్ల రాజిరెడ్డి
* ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని సైదాపూర్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు సారబుడ్ల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు వెళ్ళి ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం వారికి మజ్జిగ ప్యాకెట్లను ఇచ్చి వారి దాహార్తి తీర్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఈ 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల లోపే ప్రజలందరికీ 6 గ్యారంటీల స్కీములను ప్రజల ముందు ఉంచామని, ఇది ప్రజా ప్రభుత్వమని అన్నారు. పేద ప్రజలకు ఎల్లప్పుడూ పని దొరకాలని ప్రవేశపెట్టిన పథకమే ఉపాధి హామీ పథకమని తెలిపారు.కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో గెలిపిస్తే ఉపాధి హామీ పథకం కింద ప్రతి రోజు 400 రూపాయల పని వేతనం వస్తుందని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేరాల ప్రభాకర్ రావు, మాజీ ఎంపీటీసీ పరకాల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు మారుపాక తిరుపతి, మాజీ సర్పంచ్ మొలుగూరి కొంరయ్య, కంది తిరుపతి రెడ్డి, కొంపెల్లి తిరుపతి రెడ్డి, మొలుగూరి రవి, మొలుగూరి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.