సిరాన్యూస్, భీమదేవరపల్లి
బడుగు బలహీన వర్గాల ఐక్యతకు పాటుపడాలి
* అంబేద్కర్ గ్రామ శాఖ అధ్యక్షునిగా నాగిళ్ల సారయ్య
* మల్లారం గ్రామ అంబేద్కర్ కమిటీ ఎన్నిక
బడుగు బలహీన వర్గాల ఐక్యతకు పాటుపడాలని అంబేద్కర్ గ్రామ శాఖ అధ్యక్షుడు నాగిళ్ల సారయ్య అన్నారు. తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో అంబేద్కర్ నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షునిగా నాగిళ్ల సారయ్య, ఉపాధ్యక్షులు నాగిల్ల యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా నాగిల్ల శ్రీనివాస్, కోశాధికారిగా నాగిల్ల లింగాస్వామి, కార్యదర్శిగా నాగిల్ల ప్రశాంత్ ఏకగ్రీవంగాఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ మండల కన్వీనర్ బొల్లంపల్లి రాజు, మండల కో కన్వీనర్ కొమ్ముల రవీందర్, మండల కన్వీనర్ ఏలుర్తి ప్రేమ్ రాజ్, సీనియర్ నాయకులు జోడుముంతల వెంకటస్వామి, గ్రామ కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని కమిటీ పిలుపునిచ్చింది.