సిరా న్యూస్, ఆదిలాబాద్:
పార్డి-కే లో సిసి రోడ్డు పనులకు భూమి పూజ…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పార్డి-కే గ్రామంలో సిసి రోడ్డు పనులకు సర్పంచ్ అస్తక్ ఉజ్వల సుభాష్ భూమి పూజ చేసారు. మంగళవారం ఈ మేరకు గ్రామంలో స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… ఉపాధి హామీ నిధులు రూ.14 లక్షలతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రూ. 7 లక్షలతో సిసి రోడ్డు, మరో 7 లక్షలతో డ్రైనేజీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.