సిరాన్యూస్, బేల
పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: బీజేపీ మాజీ సర్పంచ్ ఇంద్ర శేఖర్
పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ మాజీ సర్పంచ్ ఇంద్ర శేఖర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని దేవుజీ గూడా, బేడోడా,గూడా పలు గ్రామాలను సందర్శించి భారీ వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను రోడ్లను చెరువులను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు అధికారులతో సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.దేవుజి గూడా గ్రామం నుండి వెళ్లే బ్రిడ్జ్ భారీ వర్షం నేపథ్యంలో కొట్టుకపోవడంతో ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వెంటనే నూతన బ్రిడ్జి మంజూరు అయ్యేలా చూస్తామని గ్రామస్తులకు హామీ ఇవ్వడం ఇచ్యారు. కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు నవీన్ పొత్ రాజ్, మాజీ సర్పంచ్ రాకేష్,గణేష్,నారాయణ్ ఉప్పల్వర్, మోరేశ్వర్,శంకర్,తదితరులు ఉన్నారు.