Satish Gurunule: త్వ‌ర‌లో ధ్యాన మందిర నిర్మాణం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
త్వ‌ర‌లో ధ్యాన మందిర నిర్మాణం
* ధ్యాన కేంద్ర అధ్యక్షులు సతీష్ గురునులే
* సద్గురు పూలాజీ బాబా ధ్యాన మందిర కమిటీ ఏర్పాటు
త్వరలోనే భవ్యమైన ధ్యాన మందిర నిర్మాణాన్నిచేప‌ట్ట‌నున్న‌ట్లు నూతనంగా ఎన్నికైన ధ్యాన కేంద్ర అధ్యక్షులు సతీష్ గురునులే అన్నారు. శ్రీశ్రీశ్రీ పరమాంస సద్గురు పులాజి బాబా పాట్నాపూర్ సంస్థాన్ వారి ఆదిలాబాద్ శాఖ ధ్యాన మందిరం నిర్మాణ కమిటీని గురువారం రాత్రి సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తాలో గల తాత్కాలిక ధ్యాన కేంద్రంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా సతీష్ గురునులే, ప్రధాన కార్యదర్శిగా సుకుమార్ పేట్కూలే లను ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా జాధవ్ సోనే సింగ్, ఉపాధ్యక్షులుగా మానాల లింగన్న, కోశాధికారిగా షేడ్కే దత్తు లను ఏకగ్రీవంగా ఎన్నుకోగా సలహా సంఘ సభ్యులుగా ప్రేమ్ రాజ్ గౌడ్, గేడం సోనేరావు, డాక్టర్ జ్ఞానేశ్వర్ కోతులే, సంయుక్త కార్యదర్శిగా గేడం విట్టల్, రాథోడ్ సంతోష్ లు ఎన్నిక కాగా కార్యవర్గ సభ్యులుగా హనుమాన్ ప్రసాద్, మల్లారి బేలే, మాగాడే పండిత్, రాథోడ్ విశాల్, మాధవ్ దండిగావ్కర్, మనోజ్ చింతావార్,ఉఘడే సురేష్, రాథోడ్ తులసి రామ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా మహిళా సంఘ సభ్యులుగా గేడం కైలేశ్వరి, గురునూలే మనీషా, పేట్కులే కల్పన, ఆర్. పల్లవి, ఆర్. శశికళ, డి. లలిత, ఆర్. అరుణ ఎస్. దుర్గ లు ఎన్నుకోబడ్డారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన ధ్యాన కేంద్ర అధ్యక్షులు సతీష్ గురునులే, ప్రధాన కార్యదర్శి సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ. త్వరలోనే ఆదిలాబాద్ శివారు ప్రాంతమైన మావల హైవే పక్కన ఒక ఎకరం స్థలంలో భవ్యమైన ధ్యాన మందిర నిర్మాణాన్ని చేపట్టనున్నామని దానికి దాతలు, రాజకీయ నాయకులు సహకరించి బాబా గా బోధనలైన ధ్యాన, జ్ఞాన మార్గాన్ని అందరి దరికి చేర్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *