సిరా న్యూస్, హుస్నాబాద్
ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి
మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్
* అంబేద్కర్ విగ్రహ కూడలి వద్ద ధర్నా
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్ ఆర్ ఎస్ ను ఉచితంగా చేపట్టాలని హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు హుస్నాబాద్ అంబేద్కర్ విగ్రహ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగా ఎల్ ఆర్ ఎస్ ను ప్రక్రియను ఉచితంగా చేయాలని గత బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. రాష్ట్రంలో 25.44 లక్షల మంది ఎల్ అర్ ఎస్ దరఖాస్తుదారులు ఉన్నారని వారి నుండి 20వేల కోట్లు రూపాయలు అక్రమంగా వసూలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎల్ ఆర్ ఎస్ డబ్బులు కట్టవద్దని తమ ప్రభుత్వం వస్తే ఎల్ ఆర్ ఎస్ ను ఉచితంగా చేపిస్తామని మాట్లాడి ఇప్పుడు సోయి తప్పినట్లుగా మాట్లాడుతున్నరని, ప్రజల దగ్గర నుండి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండానే ఉచితంగా ఎల్ఆర్ఎస్ రెగ్యులైజర్ చేస్తానన్న హామీకి ప్రభుత్వ మంత్రులు కట్టుబడి ఉండాలని అన్నారు.ఈ నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని, అప్పటికి వినకపోతే న్యాయస్థానలను కూడా ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందన్నారు
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ మండలాల్లోని ముఖ్య కార్యకర్తలు,నాయకులు,పార్టీ శ్రేణులు,పాల్గొన్నారు.