సిరా న్యూస్, ఖానాపూర్
భారీ బహిరంగ సభకు బయలుదేరిన మహిళలు
* జెండా ఊపి బస్సును ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించే భారీ సభకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం నుండి మంగళవారం మహిళల బస్సులో బయలుదేరారు. ఈ బస్సును మున్సిపల్ చైర్మన్ రాజూరా సత్యం జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభకు ఖానాపూర్ పట్టణం నుండి మహిళలు భారీగా తరలి వెళ్లారన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే సభలో స్వయం సహాయక మహిళలకు వడ్డీ లేని రుణాలకు ముఖ్యమంత్రి స్వీకారం చుట్టబోతున్నారని అన్నారు . కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ , మెక్మా సిబ్బంది, స్ట్రీట్ వెన్డర్స్ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.