సిరాన్యూస్,జైనథ్,
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కాన్పమేడిగూడ రోడ్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్ తో కలిసి ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే, కొనిగెల నారాయణ లు ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యవాన్ చిక్టే మాట్లాడుతూ కాన్పమేడిగూడ రోడ్ గ్రామంలోని విధుల గుండా ర్యాలీ కొనసాగించినట్లు తెలిపారు. బడీడు పిల్లలు బడిలో ఉండాలనే నినాదంతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బడి బాట కార్యక్రమం ఈనెల 19 వరకు వివిధ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు. కొత్త గా వచ్చే విద్యార్థులకు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు, రెండు జతల బట్టలు, ఉచితంగా మధ్యాహ్న భోజనంతో సహా వారానికి మూడు గుడ్లు అందజేస్తున్నామని తెలిపారు.సకల సౌకర్యంతో ప్రభుత్వ పాఠశాలలు స్వాగతం పలుకుతున్నాయని, ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నాణ్యమైన చదువు, నిపుణులైన ఉపాధ్యాయులతో బోధన జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సుజాత, ఉపాధ్యాయులు సంతోష్, దేవిదాస్, ప్రకాష్, పెంటపర్తి ఊశన్న, గ్రామ పంచాయతి కార్యదర్శి నైమతుల్ల, మాజీ చైర్మన్ పోలవేణి అడేల్లు, అంగన్ వాడి టీచర్స్ కళావతి, స్వప్న, గంగాదేవి, గ్రామస్తులు మమత, దేవరావ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.