మా ఇళ్లను కాపాడండి

సిరా న్యూస్,పెద్దపల్లి’;
రామగుండంలో బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం ముందు సింగరేణి క్వార్టర్స్ కోల్పోతున్న బాధితులు ప్ల కార్డ్ లు ప్రదర్శించారు. రోడ్డు వెడల్పుతో పేరుతో భూ కబ్జాకు పాల్పడుతున్నారని ఆందోళనకు దిగారు. రామగుండం ఎమ్మెల్యే రాజకీయ ఆరాచకత్వానికి పరాకాష్ట అంటూ నిరసన ప్రకటించారు. 70 ఏళ్ళ నివాస క్వార్టర్స్ తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రామగుండం ఎమ్మెల్యే తీరుపై అసెంబ్లీలో ఎండగట్టాలని విజ్ఞప్తి చేసారు.
ఇండ్లు కోల్పోతున్న వారి గోడును అసెంబ్లీలో ప్రస్తావించి తమ గొంతుకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తిచేసారు. రామగుండం ఎమ్మెల్యే సింగరేణి చెరబట్టారని ఆరోపించారు. కాపాడాల్సిన ఆర్జీ వన్ జీఎం కరెఫ్ట్ అయ్యాడని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *