– యుటియఫ్ వినతి
సిరా న్యూస్,బద్వేలు;
ప్రభుత్వ ప్రాథమిక విద్యారంగానికి గొడ్డలిపెట్టుగా మారిన జీవో నెంబర్ 117 ను రద్దు చేసే విధంగా ప్రభుత్వంపై తగిన ఒత్తిడి తీసుకురావాలని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు రెడ్డిని యుటిఎఫ్ కడప జిల్లా శాఖ పక్షాన కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
శనివారం ఉదయం కడపలోని శ్రీనివాసులు రెడ్డి నివాసంలో యుటిఎఫ్ నాయకులు ఆయనను కలిసి ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేయవలసిందిగా అభ్యర్థించారు.
ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 117 ను రద్దుచేసి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను యధావిధిగా కొనసాగిస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని రద్దుచేసి ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలను పాత పద్ధతి లో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత పాఠశాలలు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు, ప్లస్ టు వరకు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాథమిక విద్య మాతృభాషలోను,ఉన్నత విద్య తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాల్లో కొనసాగించాలని తెలిపారు.ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను గుర్తించి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు కొనసాగేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.జీవో నెంబర్ 117 ను వెంటనే రద్దు చేసి వీలైనంత త్వరగా డీఎస్సీ నియామకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన అప్రెంటిస్ విధానాన్ని రద్దుచేసి కొత్తగా నియామకం అయ్యే ఉపాధ్యాయులకు పూర్తి వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మోడల్ స్కూల్, ఎయిడెడ్ మరియు గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రెగ్యులర్ వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల కు దూరం చేసి బోధనకు మాత్రమే పరిమితం చేయాలని అనవసర యాప్ లన్నింటినీ రద్దు చేయాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలన్ని చెల్లించి కొత్త పిఆర్సి ని ప్రకటించే విధంగా కృషి చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సివి రమణ చింతకొమ్మదిన్నె మండల అధ్యక్షుడు కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.