సిరా న్యూస్,భద్రాద్రి;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి జాతర జరగగా,గత రాత్రి డాన్స్ బేబీ డాన్స్ పేరుతో 10మంది యువతులతో ఆలయ కమిటీ సభ్యులు అశ్రీల నృత్యాలతో హోరెత్తించారు. పదుల సంఖ్యలో పోలీసులు జాతరలో విధులు నిర్వహిస్తున్నప్పటికి పట్టించుకోకపోగా ప్రేక్షకుల పాత్ర వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ జాతర అయిదు రోజుల్లో దాదాపు రోజుకు 15వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.అయితే ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలేని ఆలయ ఈ.ఓ రికార్డింగ్ డాన్సులు పెట్టు యువతులతో అసలైన డాన్సులు చేయించాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహ్లాద కరమైన వాతావరణంలో చిన్నారులు,కుటుంబ సభ్యులతో కలిసి జాతర తిలకించటానికి వచ్చిన మహిళలు సైతం ఆలయ పరిసరాల్లో అశ్లీల నృత్యాలు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా బాస్ స్పందించి ఈవో పై చర్యలు తీసుకోవాలని భక్తుల కోరుకుంటున్నారు.
================