సిరా న్యూస్,నిర్మల్;
సోన్ మండలం కడ్తాల్ జాతీయ రహదారిపై ప్రైవేటు పాఠశాల బస్సు కు పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను తీసుకువచ్చేందుకు సోన్ మండలంలోని మాదాపూర్, పాక్ పట్ల గ్రామాలకు వెళ్ళింది. విద్యార్థులను ఎక్కించుకొని తిరుగు ప్రయాణమైంది. కడ్తాల్ జాతీయ రహదారిపై బస్సు ప్రయాణిస్తున్న సమయంలో పక్కనుండి వెళ్తున్న లారీ టైరు పేలి బస్సుకు తగలడంతో బస్సు ఒకవైపు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంతో బస్సులో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే వారిని నిర్మల్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోషకులు ఆస్పత్రికి చేరుకొని తమ తమ పిల్లలను తీసుకువెళ్లారు.