సిరా న్యూస్,జగిత్యాల;
ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని జగిత్యాల రూరల్ మండలం ప్రత్యేక అధికారి బోనగిరి నరేష్ ఆన్నారు..అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ విధి విధానాలపైన శిక్షణ కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరములో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ మండలం ప్రత్యేక అధికారి బోనగిరి నరేష్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఆదర్శ పాఠశాల కమిటీల బాధ్యత లు, వారు చేపట్టవలసిన పనుల ప్రాధాన్యతల గురించి వివరించారు.
త్రాగు నీరు, మరుగు దొడ్ల మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం, పాక్షిక మరమ్మతులు చేపట్టాలని, మధ్యాహ్న భోజన నిర్వహణ,విద్యార్థులకు యూనిఫామ్ పంపిణి తదితర అంశాలపై ప్రధానోపాధ్యాయులు, కమిటి చైర్మన్, సభ్యుల సహకారం తో సజావుగా నిర్వహణ చేపట్టాలని తెలియ జేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం తరగతులలో మైనర్ మేజర్ మరమ్మత్తులు, నిరుప్రయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకురావడం బాలికల కోసం అదనపు టాయిలెట్లు నిర్మాణం తరగతి గదికి విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వసతులు అమ్మ పాఠశాల కమిటీ ద్వారా నిర్వహిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల, అర్బన్ మండల ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ , కమీషనర్ అనిల్ బాబు అర్బన్ , రూరల్ ఎంపీడీఓలు, మాస్టర్ ట్రైనర్స్ ,మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్,ఎంపీవో రవిబాబు,ఏఈలు,ఎంపీవోలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఏపీఎం గంగాధర్,సీసీ లు,వివో లు, మెప్మా డీఎంసీ సునీత, టీఎంసీ రజిత,సీవో రాధ,ఏఎల్ఎఫ్ టీఎల్ఎఫ్ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.