సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
కళ్యాణదుర్గం ఎస్ వి జిఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగము వారు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. జయరామరెడ్డి విజ్ఞానశాస్త్ర ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. భౌతిక శాస్త్ర విభాగాధిపతి, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ పి సూర్య నాగిరెడ్డి రామన్ ఫలితము, దాని ఉపయోగాల గురించి విద్యార్థులకు కూలంకషంగా వివరించారు. భౌతికశాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ కలిముల్లా జాతీయ సైన్స్ దినోత్సవం- 2024 థీమ్ గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కెమిస్ట్రీ విభాగ అధిపతి డాక్టర్ శైలజ రాణి, జువాలజీ అధ్యాపకురాలు శ్రీమతి ప్రభావతి, తెలుగు విభాగాధిపతి డాక్టర్ జ్యోత్స్న ప్రసంగించారు. కార్యక్రమంలో డి కవిత, రుక్మిణి భాయ్, నాగ మస్తానయ్య, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.