సిరాన్యూస్,బేల
గులాబి రంగు పురుగు నివారణ చర్యలు చేపట్టాలి: శాస్త్రవేత్త డాక్టర్ కే రాజశేఖర్
పత్తి పంటను తీవ్రంగా నష్టపరిచే గులాబి రంగు పురుగు నివారణ చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ కే రాజశేఖర్, డాక్టర్ జి శివ చరణ్ లు అన్నారు. మంగళవారం బేల మండల కేంద్రంలో పత్తి, సోయాబీ పంటలను అదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్బంగా శాస్త్రవేత్తలు డాక్టర్ కే రాజశేఖర్, డాక్టర్ జి శివ చరణ్ మాట్లాడుతూ పత్తి పంటలో ప్రస్తుతం రసం పీల్చే పురుగు నివారణ చర్యలను రైతులకు సూచించారు. అలాగే పత్తిని తీవ్రంగా నష్టపరిచే గులాబి రంగు పురుగు ఉనికిని గమనించేందుకు ఎకరాకు 8 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎమోజిన్ బెంజేట్ +ప్రోఫీనోపాస్ 1.4 గ్రా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. కాయ కుళ్ళు నివారణకు ఫ్రోఫీకోనజల్ 1.మి.లీ లేదా క్రై సర్ సింగ్ మిథైల్ 1 లీటర్ నీటిని కలిపి పిచికారి చేసుకోవాలని, సోయాబీన్ లో కాయ కుళ్ళు నివారణకు , టేబు కొనసజల్+సల్ఫర్ 2.5గ్రా లీటర్ నీటిని కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.