Second ANM: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

సిరా న్యూస్, కరీంనగర్
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
* దేశ వ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ విజ‌య‌వంతం
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని రెండో ఏఎన్ఎంలు యూనియన్ అధ్యక్షురాలు స్వాతి అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో దేశ వ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను కార్మిక సంఘాలు విజయవంతం చేశారు. దేశవ్యాప్త బందును పాటిస్తూ సీఐటియు, ఏఐటి యుసీ సంఘాల అధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకు నిరశన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తూ కార్మికుల పట్ల‌ అన్యాయంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మారేళ్ల శ్రీలత, నాయకులు రజిత, అంగన్వాడి యూనియన్ అధ్యక్షులు అనురాధ, బి విజయ,ఆశ యూనియన్ పెద్దపెల్లి శోభ, నాయకులు సరోజన, శ్వేత, పశు మిత్ర యూనియన్ అధ్యక్షులు ప్రభ, నాయకులు స్వర్ణలత, మిడ్ డే మీల్స్ యూనియన్ నాయకులు షబానా ,అంజవ్వ, పద్మతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *