జలదంకి;
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు రోజురోజుకి తారస్థాయికి చేరుతున్నాయి. నెల్లూరు జిల్లా జలదంకి మండలం గోపన్నపాలెం గ్రామంలో వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురయింది. గ్రామ సర్పంచ్ గండు వెంకా రెడ్డి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ ఓవర్గం రాజగోపాల్ రెడ్డి నిలదీసింది. మీకు ఓట్లేసి మా చెప్పుతో మేం కొట్టుకోవాలా అంటూ గ్రామస్తులు రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు. మాపై కేసులు పెట్టి మహిళల సైతం జైలుకు పంపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల తీరుతో మేకపాటి ఉక్కిరి బిక్కిరయ్యారు. మండల నాయకులు ఎంత నచ్చ చెప్పాలని చూసినా గ్రామస్తులు వినిపించుకోలేదు.