సిరా న్యూస్,సికింద్రాబాద్;
ప్రధాని మోడీ సికింద్రాబాద్ మహాంకాళి దర్శనం నేపద్యంలో అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. ఆలయ ప్రాంగణంలో మోడీ తో పాటు ప్రధాన అర్చకుడికే అనుమతి ఇచ్చారు. బెంగుళూరు పేలుళ్ల నేపథ్యంలో ఎస్పీజీ మహాకాళి దేవాలయాన్ని తమ ఆధీనంలో తీసుకుంది. బారికెడ్లతో ఆలయ పరిసర ప్రాంతాలను మూసేశారు.