731 మంది దివ్యాంగులకు వివిధ రకాల ఉపకరణాల పంపిణీ
ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి
సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ పట్టణంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా సమగ్ర శిక్షణ ప్రాజెక్టు అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక అధికారిత శివిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు నాగార్జున రెడ్డి హాజరయ్యారు. 731 మంది వికలాంగులకు వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేసారు.
ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు ఆత్మస్థైర్యం మనోధైర్యం నింపే దిశగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని రానున్న కాలంలో వారి అభ్యున్నతకు మరింత పాటు పడుతుందని ఆయన తెలిపారు. ఎంపీ అవినాష్ రెడ్డి సహకారంతో 90 లక్షల రూపాయల ఎంపీ లార్డ్స్ నిధులతో దేశ చరిత్రలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ కడప జిల్లాలో దివ్యాంగుల ముఖాలలో చిరునవ్వే ప్రాధాన దేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఈ అన్నారు .
ప్రభుత్వ సలహాదారుడు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ గతంలో కొద్దిమందికే ఉపకరణాకు ఇచ్చేవారని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో వేలాదిమంది దివ్యాంగులకు ఇలాంటి ఉపకారణాలు ఇవ్వడం ఇది ఒక చరిత్రని వీటిని సద్వినియోగం చేసుకొని జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని దివ్యాంగులును ఉద్దేశించి ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సగర కార్పొరేట్ చైర్మన్ రమణమ్మ, మున్సిపల్ అధ్యక్షుడు సుందరరామిరెడ్డి , మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి ఈగ యద్ధారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, గిద్దలూరు నియోజకవర్గ పరిశీలకుడు బంగారు శీనయ్య బద్వేలు జడ్పిటిసి వంకెల చిన్న పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.