యాదాద్రిలో వరుస దొంగతనాలు

సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి భువనగిరి జిల్లాలో వరస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు..డిచిన ప్రతి రోజుల్లోనే 8 దొంగతనాలు జరిగాయి. మోట కొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో భవనం పై నిద్రిస్తున్న మహిళ మెడలో నుండి మూడున్నర తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకున్న డిసిపి రాజేష్ చంద్ర. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు.. గడిచిన 10 రోజుల్లో 8 దొంగతనాలు జరిగాయి ఆలేరు బోనగిరి మోటకొండూరు బీబీనగర్ ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. భువనగిరి మండలం చీమల కొండూరు నాగిరెడ్డిపల్లి బోనగిరి టౌన్ లో దొంగతనాలు జరిగాయి.. ఆలేరు పట్టణంలో మరియు మూటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో దొంగతనాలు జరిగాయి.. ఆరు బయట నిద్రిస్తున్న మహిళలే టార్గెట్గా చేస్తూ రోజు కొత్త రకాలు దొంగతనాలు చేస్తున్నారు దొంగతనం చేసి వెళ్లే వరకు కూడా అక్కడ నిద్రిస్తున్న వారికి కూడా కనీసం సృహ లో లేకుండా ముందస్తుగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు.. పోలీసులు పదేపదే గ్రామాల్లో డప్పు చాటింపులు చేసిన ఆరుబయట నిద్రించడంతో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని అంటున్నారు పోలీసులు స్థానికుల మద్దతు కూడా పోలీసులకు కావాలని దొంగతనాలను అరికట్టాలంటే గ్రామాల్లో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *