సిరా న్యూస్,హైదరాబాద్;
గ్రామపంచాయతీలో సర్పంచులు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. సర్పంచులు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వీ యాదయ్య మాట్లాడుతూ దేశంలోనే గొప్పగా గ్రామాలను తీర్చి దిద్దిన ఘనత మా సర్పంచ్ లది. సీసీ రోడ్లు, రైతు వేదికలు, స్మశాన వాటికలు నిర్మించి గ్రామాలను అభివృద్ధి చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే సర్పంచులు నిరసన చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. గ్రామాలను అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలకంగా సర్పంచులు వ్యవహరించారు. అప్పుల తెచ్చి గ్రామాభివృద్ధి చేశాం. ఇప్పుడు పదవి పూర్తయినా కూడా బిల్లులు విడుదల చేయకపోవడంతో అప్పు ఇచ్చిన వారు తిరగబడుతున్నారని అన్నారు.
గత ప్రభుత్వం సర్పంచులను మోసం చేసింది. అధికారంలోకి రాగానే సర్పంచులను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్పందించడం లేదు. ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలిసి వినతి పత్రం అందజేసాము. ఇప్పటికైనా స్పందించకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వేలాది మంది సర్పంచ్ లము నామినేషన్ లు వేసి పోటీ చేస్తాం అని హెచ్చరించారు.
అందోళనకారులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.