చిలుకూరు బస్టాండ్ మీ సేవ కేంద్రం వద్ద చలివేంద్రం ఏర్పాటు.

సిరా న్యూస్,సూర్యాపేట;
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు గ్రామంలోని బస్టాండ్ సెంటర్ లో వీరబాబు మీ సేవ కేంద్రం వద్ద చలివేంద్రం ప్రారంభించిన చిలుకూరు ఎమ్మార్వో రుద్ర కుమార్. ఎమ్మార్వో మాట్లాడుతూ,వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని , వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పగటిపూట అవసరం ఉంటే తప్ప బయటకి రావద్దని సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలన్నారు. అధికంగా మంచినీటిని తాగుతూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. అదేవిధంగా చిలుకూరు మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే గిరిబాబు, మండల స్పెషల్ ఆఫీసర్ రూపేందర్ సింగ్ , కరుణ శ్రీ, సీతారామచంద్రరావు, మంజుల , సీనియర్ అసిస్టెంట్ శైలజ, జూనియర్ అసిస్టెంట్ వీరన్న, పిఎసిఎస్ చైర్మన్ అలస కాని జనార్ధన్ , కొల్లు నాగయ్య, మండవ వీరబాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *