సిరాన్యూస్, నిర్మల్
దుర్గ పేరు మీద రూ.1,01,515 ఫిక్స్డ్ డిపాజిట్: సేవా భారతి, జై హింద్ వాట్సాప్ సమూహం సభ్యులు
నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గ అనే చిన్నారి తల్లి మూడు రోజుల క్రితం మరణించడంతో అనాధగా మారింది. ఆ చిన్నారికి మేమున్నామన్న భరోసనందిస్తూ సేవా భారతి, జై హింద్ వాట్సాప్ సమూహం సభ్యులు విరాళాలను సేకరించారు. విరాళాల రూపంలో వచ్చినటువంటి డబ్బులు రూ.1,01,515 గ్రామస్తులు, యువకుల సమక్షం లో చిన్నారి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాభారతి సభ్యులు కృష్ణదాస్,దామోదర్, డా.ప్రమోద్ చంద్రారెడ్డి, ముండే ఈశ్వర్, మునిగెల శ్రీధర్, కోస్మెట్ శుద్దోధన్, కొప్పుల నవీన్, యోగేష్, స్థానిక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సంతోష్ ,గ్రామ సర్పంచ్ సాయినాథ్, గ్రామ యువకులు, దత్తు, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.