సిరా న్యూస్,ఒంగోలు;
వైసీపీ ఏడో లిస్టు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను ఉలిక్కిపడేల చేసింది. రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు ముఖ్యులను పక్కన పెట్టడమేకాకుండా.. అనూహ్యంగా కొత్తవారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంహాట్టాపిక్గా మారింది. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్రెడ్డికి సీటుదక్కదనే ప్రచారం ఎప్పటినుంచో ఉన్నా… పర్చూరు వద్దనుకున్న ఆమంచికి ఎలాంటిప్రత్యామ్నాయం చూపకపోవడమేచర్చకు తావిస్తోంది.కేవలం రెండు పేర్లతోవిడుదలైన వైసీపీ ఏడో లిస్టు అధికార వైసీపీలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఒక్క జాబితాలో ఇద్దరు నేతలు,మూడు నియోజకవర్గాల సమస్యను సెటిల్ చేసింది వైసీపీ.. ఐతే ఈ మార్పులు నియోజకవర్గాల్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగామారింది. సీటు దక్కని ఇద్దరు కూడా ప్రముఖులే కావడంతో… రాజకీయంగా వారుఎలాంటి స్టెప్ తీసుకుంటారనే ఉత్కంఠ రేపుతోంది.చడీచప్పుడు లేకుండా వైసీపీవిడుదల చేసిన ఏడో జాబితాలో పర్చూరు ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ కందుకూరు ఎమ్మెల్యే మహీధర్రెడ్డి సీట్లు కోల్పోయారు. ఇందులోమహీధర్రెడ్డికి ఈ సారి చాన్స్ లేనట్లేనని తొలి నుంచి ప్రచారంజరుగుతోంది.
ఐతే ఆయన స్థానంలో ఎవరు వస్తారనేదే ఇన్నాళ్లు సస్పెన్స్…ఇప్పుడు ఆ ఉత్కంఠ తొలగిపోయింది.మహీధర్రెడ్డి స్థానంలో నెల్లూరుజిల్లాకు చెందిన విద్యా సంస్థల అధినేత, బీసీ సామాజిక వర్గానికి చెందినఅరవింద యాదవ్ను తెరపైకి తేవడం సంచలనం సృష్టిస్తోంది.ఇప్పటివరకునియోజకవర్గానికి పరిచయం లేని అరవిందను.. కేవలం బీసీ.. అందునా యాదవసామాజికవర్గం కోణంలో సీటు కేటాయించడం వెనుక ప్రత్యేక వ్యూహం దాగుందనిఅంటున్నారు పరిశీలకులు. అంతేకాకుండా.. కొత్త ఇన్చార్జిని ప్రకటించేసమయంలో ఎమ్మెల్యే మహీధర్రెడ్డి, అరవింద కలిసివున్న ఫొటో బయటపెట్టడం కూడావ్యూహమే అంటున్నారు. అరవింద వైసీపీలో చేరినప్పుడు తనను పిలిచారని… తీరాతనకు తెలియకుండా తన నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు మహీధర్రెడ్డి.1989 నుంచి కందుకూరు నియోజకవర్గంలో రాజకీయాలుచేస్తున్న మహీధర్రెడ్డి.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇప్పుడుసడన్గా తప్పుకోమని పార్టీ ఆదేశించడంతో ఆయన భవిష్యత్పై రకరకాల ఊహాగానాలువినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పటిష్టమైన ఓటు బ్యాంకు ఉన్నమహీధర్రెడ్డి పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటారా? లేక ప్రత్యామ్నాయంచూసుకుంటారా? అనేది ఆసక్తి రేపుతోంది. తనకు సీటు దక్కదనే ప్రచారం మొదలైననుంచి రామాయపట్నం పోర్టు నిర్వాసితులతో కలిసి ఆందోళన బాటపట్టినమహీధర్రెడ్డి పరోక్షంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నట్లేననిఅంటున్నారు.ఇదేవిధంగా పర్చూరులో మార్పు కూడా విస్తృత చర్చకు దారితీసింది.వాస్తవానికి పర్చూరులో ఇన్చార్జిగా ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచికృష్ణమోహన్ తొలి నుంచి ఆ బాధ్యతలపై విముఖంగానే ఉన్నారు. తన సొంతనియోజకవర్గం చీరాల మళ్లీ కేటాయించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు.
పర్చూరులో టీడీపీ.. ఆ పార్టీకి అనుకూలంగా కమ్మ సామాజిక వర్గం బలంగాఉండటంతో… అక్కడ గెలుపు అంత ఈజీ కాదని గ్రహించిన ఆమంచి ఎప్పటి నుంచో సీటుమారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే కరణంబలరాం కారణంగా కృష్ణమోహన్ ఆశలు ఫలించలేదు.
పేరుకు పర్చూరు ఇన్చార్జిగాపనిచేస్తున్నా… ఆయన మనసంతా చీరాల చుట్టూనే తిరుగుతుండటంతో కొత్త వారికిబాధ్యతలు అప్పగించింది వైసీపీ.. ఐతే అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగాఅమెరికాలో ఉన్న టీడీపీ మాజీ నేత యెడం బాలజీకి పర్చూరు ఇన్చార్జిగానియమించడం క్యాడర్ను ఆశ్చర్యానికి గురిచేసింది.2014లో చీరాల వైసీపీఅభ్యర్థిగా పోటీ చేసిన యెడం బాలాజీ… ఆ ఎన్నికల్లో ఓటమితో టీడీపీలోచేరారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వ్యాపార రీత్యాఅమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం స్థానిక రాజకీయాలకు దూరంగా ఉన్నబాలాజీని గుర్తు చేసుకుని మరీ పిలిపించి ఇన్చార్జి సీటు కట్టబెట్టారుసీఎం జగన్. పర్చూరులో కమ్మ సామాజిక వర్గం తర్వాత కాపు సామాజిక వర్గంఎక్కువగా ఉంటుంది.