సిరా న్యూస్, ఖానాపూర్
సుభాష్ నగర్లో కాంగ్రెస్ నాయకుల ఇంటింటా ప్రచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 12వ వార్డు లో మంగళవారం స్థానిక కౌన్సిలర్ షబ్బీర్ పాషా ,బూత్ కమిటీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ఓటర్లకు వివరించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆయుబ్,అల్లెపు రవి ,మిర్జా బేగ్, షకీల్,ఓర్సు లక్ష్మి,ఏనుముల నర్సయ్య లు పాల్గొన్నారు.