సిరా న్యూస్,ఖానాపూర్
తాటిచెట్టు పై నుండి కింద పడి గీత కార్మికుడు మృతి
తాటిచెట్టు పై నుండి కింద పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన ఖానాపూర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాధనకుర్తి గ్రామం కి చెందిన మంచికంటి శంకర్ గీత కార్మికుడు బుధవారం ఉదయం పిల్లల కోసం తాటి ముంజలు తెస్తానని వెళ్లాడు. అయితే తాటి చెట్టు ఎక్కి అనుకోకుండా ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి కింద పడి ఆక్కడికి అక్కడే మృతి చెందాడు. మంచికంటి శంకర్ కాంగ్రెస్ కార్యకర్త కావడంతో వల్ల కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.