షర్మిల చిన్న పిల్ల..ఓవర్ యాక్షన్ చేస్తుంది

 సిరా న్యూస్,గుంటూరు;
మిర్చి యార్డ్ లో మంత్రి అంబటి రాంబాబు రైతు లకు అల్పాహారం , భోజన శాల ప్రారంభ కార్యక్రమం లో పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి యార్డ్ ఛైర్మన్ మినహా ఇతర యార్డ్ డైరెక్టర్ లు డుమ్మా కొట్టారు..
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదు. దాడులను అందరూ ఖండించాల్సిందేనని అన్నారు.దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదు. తొండపి గ్రామంలో పరస్పర గొడవలు జరుగుతుంటాయి. గతంలో నేను వెళ్లిన సమయంలో కూడా గొడవ జరిగిందని అన్నారు.
కన్నా లక్ష్మీ నారాయణ, కార్యక్రమం ముందే పోలీసులకు ఓ మాట చెప్పి ఉండాల్సింది. షర్మిలా చిన్న పిల్ల.. ఓవర్ యాక్షన్ చేస్తుంది. మిర్చి యార్డులో వర్గ పోరు లేదు. చిన్న చిన్న అభిప్రాయ బేధాలుంటే సర్థుబాటు అవుతాయి. అందరం జగన్ నాయకత్వంలో పని చేస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *