సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ నుంచి సచివాలయానికి వైఎస్ షర్మిల పాదయాత్రగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి బయలుదేరారు. ఈ పాదయాత్ర ఏలూరు రోడ్డు మీదగా వెళ్తూ చల్లపల్లి బంగ్లా వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి మానవహారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన వేలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తలని నాయకుల్ని విడుదల చేయాలంటూ ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.