సిరా న్యూస్, జైనథ్
షీ టీంపై విద్యార్థులకు అవగాహన
షీటీంపై మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పిప్పరవాడ గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా షీటీం సభ్యులు సుశీల మాట్లాడారు. మహిళల భద్రతే షీ టీం లక్ష్యమని తెలిపారు.
మహిళల భద్రత, సైబర్ క్రెం, ఆన్లైన్ మోసాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.పాఠశాలలో కానీ, బయట ఎక్కడైన ఆకతాయిలు బాలికలను భయాందోళనలకు గురిచేసినా, వేధించినా, ఇబ్బందికరంగా మాట్లాడిన వెంటనే షీ టీం నెంబర్ 8712659953కి కాల్ చేయాలని తెలిపారు. బాలికలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేద నకు గురికాకూడదని మంచి ఆలోచనతో చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో షీ టీం సభ్యులు సుశీల సత్యమోహన్లు పాల్గొన్నారు.