సిరాన్యూస్,ఆదిలాబాద్
మహిళల భద్రతే షీ టీం లక్ష్యం : షీ టీం సభ్యురాలు బి సుశీల
* శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్లో షీటీంపై అవగాహన
మహిళల భద్రతే షీ టీం లక్ష్యమని షీ టీం సభ్యురాలు బి సుశీల అన్నారు. సోమవారం అదిలాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్ ను షీ టీం సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా మహిళల భద్రత, సైబర్ క్రెం, ఆన్లైన్ మోసాలు తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాల న్నారు. యువతులు వాళ్ల ఫోటోలు దిగి స్టేటస్ లో పెట్టడం గాని, ఫేస్బుక్లో అప్లోడ్ చేయవద్దని తెలిపారు.మహిళల రక్షణ కోసం జిల్లాలో షీటీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, విద్యార్థినులు ఈవ్టీజింగ్కు గురైతే షీటీం వెంటనే స్పందిస్తుందని, ప్రతీ మహిళా, విద్యార్థినులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేస్తే షీటీం నంబరు 8712659953కు కాల్ చేయాలన్నారు. సైబర్ క్రైమ్ నెంబర్ 1930 కే ఫోన్ చేయాలని తెలిపారు. కొత్త చట్టాల పైన కూడా జూలై 2 నుంచి అమల్లోకి వచ్చినయని తెలిపారు . ఈకార్యక్రమంలో 230 మంది విద్యార్థులు, హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం , షీటీం బృందం జి సత్యమోహన్ పాల్గొన్నారు.