గొర్రెల కాపర్లు అనుమానాలు తొలగించుకోవాలి.

మారం తిరుపతి యాదవ్
సిరా న్యూస్,కమాన్ పూర్;
గొర్రెల కాపర్లు అనుమానాలను తొలగించుకోవాలని గొర్రెల కాపర్ల రాష్ట్ర కార్యదర్శి మారం తిరుపతి యాదవ అన్నారు. ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
గత కొన్ని రోజుల నుండి గొర్రెల కాపరులు కొందరు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. వారి యొక్క అనుమానాలను, భయాలను తొలగించుటకు పెద్దపల్లి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులను కలవడం జరిగింది అని తిరుపతి అన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 75% గొర్రెల పంపిణీ పథకము రెండో విడతలో భాగంగా మన జిల్లాలో సుమారు 1800 మంది అర్హులైన గొర్రెల కాపర్లు గొర్రెల పథకం కోసం తమ వాటా డబ్బులు 43,750/-.రూ. లను జమచేసి ఉన్నారు. ఇట్టి రూపాయలు విడిపించుకోవడానికి మీ మీ మండలాల పశు వైద్యాధికారులకు అప్లికేషన్లు పెట్టుకున్న తర్వాత వారు జిల్లాకు ప్రపోజల్ ను పంపించి జిల్లాలో 50 మందివి ఒకేసారి కలెక్టర్ కి జిల్లా పశువైద్యాధికారి ప్రపోసల్ పంపించి వాటికి సంబంధించిన సాంక్షన్ ఆర్డర్ ను తీసుకున్న తర్వాత మీరు డబ్బులు విడిపించుకోవడానికి అర్హులవుతారు అని అన్నారు. కావున మీ వాటా డబ్బులు విడిపించుకోవాలనుకునేవారు వెంటనే మీ మండల పశువైద్యాధికారిని సంప్రదించగలరని కోరారు.అలాగే మీ వాటా డబ్బులు, మీరు విడిపించుకున్నంత మాత్రాన గొర్రెల పథకంలో లబ్ధిదారులుగా అలాగే ఉంటారు. ఏ పథకమైన ప్రభుత్వ విధానములో ఒక భాగం, ఇది నిరంతర ప్రక్రియ ప్రభుత్వ ఆర్థిక వనరులను సాధ్యాసాధ్యాలను చూసుకొని ఏది ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, ఇస్తూ పథకాలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి ప్రభుత్వాలు. కాబట్టి ఒకసారి పథకంలో అర్హులైన వారు లబ్ధి పొందే వరకు కూడా వారు అర్హులే, కాబట్టి ఏలాంటి అనుమానాలు లేకుండా మీ డబ్బులను మీరు విడిపించుకోవచ్చు మరల పథకం ప్రారంభమైనప్పుడు మీ వాటా డబ్బులను మీరు జమ చేయవచ్చును అని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్న యాదవులు, కురుమలు, గొర్రెల కాపరులు అందరూ దీనిని గ్రహించగలరని కోరుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *