సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఎంఈఓ ను బాధ్యతలు నుండి తొలగించాలి: సీవైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతాల్కర్ అరవింద్
ఖానాపూర్ ఎంఈఓ ను బాధ్యతలు నుండి తొలగించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చాత్రా యువ సంఘర్ష సమితి
(సి వై ఎస్ ఎస్) నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతాల్కర్ అరవింద్ అన్నారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్ ల విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మండల ఎంఈఓ మధుసూదన్ ని మిగతా మండలాలను ఎంఈఓ బాధ్యతల నుంచి కూడా తొలగించి, ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.