సిరా న్యూస్,కోనసీమ;
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గంలో శైవక్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. తెల్లవారు జామున నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువల్లో పుణ్య స్నానాలు ఆచరించి సమీపంలో గల శైవ క్షేత్రాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పలివెల శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి దేవాలయానికి విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం భక్తులు వేకువ జామునుండే బారులు తీరారు. వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లు ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు.