సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు నగరంలో నూతన డిఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన శ్రావణ్ కుమార్ విజువల్ పోలీసింగ్ నిర్వహించారు. పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారి బంధువులకు ఫోన్ చేసి వారికి లైసెన్సులు తీసుకున్న తర్వాత మాత్రమే వాహనాలు ఇవ్వాలని సూచించారు. ఆటో డ్రైవర్లకు ఎక్స్ట్రా ఫిటింగ్ లైట్లను అమరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ద్విచక్ర వాహనాలకు నంబర్లు ప్లేట్లు సరైనవి లేకుండా జరుగుతున్న వారితో నెంబర్ ప్లేట్లు తీయించి వారికి జరిమానాలు విధించారు. సరైన పత్రాలు లేకపోయినా డ్రైవింగ్ లైసెన్సులు లేకపోయినా మొదటిసారి జరిమాన్నతో సరిపెట్టి రెండో పర్యాయం కూడా ఇలాగే జరిగితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్లు నడిపే వారికి కచ్చితంగా సీట్లు బెల్టులు ధరించాలని కారులను ఆపి వారికి సూచించారు.