Shyam Sundar Reddy: విత్తన కొనుగోలులో జాగ్రత్త అవసరం: ఏఈఓ శ్యామ్ సుందర్ రెడ్డి

సిరాన్యూస్‌, బోథ్‌
విత్తన కొనుగోలులో జాగ్రత్త అవసరం: ఏఈఓ శ్యామ్ సుందర్ రెడ్డి

విత్తన కొనుగోలు రైతులు తగు జాగ్రత్తగా ఉండాలని ఏఈఓ శ్యామ్ సుందర్ రెడ్డి కోరారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండ‌లం కంటేగాం గ్రామంలో విత్తన దుకాణాన్ని ఏఈఓ తనిఖీ చేశారు. అనంతరం రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వస్తున్నాయని రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయని, విత్తనాలు కొనే ముందు లైసెన్స్ ఉన్న దుకాణాల్లో కొనుగోలు చేయాలన్నారు. ఎక్కువ ధరలకు విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. దుకాణాల్లో తప్పనిసరిగా రసీదు పొందాలని సూచించారు. వ్యాపారుల సైతం విత్తనాలకు సరిపడా ధరకు ఇవ్వాలని, ఎక్కువ ధరలకు అమ్మితే కేసులు తప్పవని పేర్కొన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే రైతులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *