సిరాన్యూస్,సామర్లకోట
సమస్యలను సత్వరమే పరిష్కరిస్తాం: ఎంపీడీవోడి శ్యాంసుందర్
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎంపీడీఓ డి. శ్యాంసుందర్ అన్నారు. సోమవారం సామర్లకోట మండల కేంద్రమైన ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల -పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారుఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో ఎస్ డి శ్యాంసుందర్ గారు తాసిల్దార్ శ్రీనివాస్, ఈవో కె హరికృష్ణ, సత్య రెడ్డి ,మండల విద్యాశాఖ అధికారి వై శివరామకృష్ణయ్య అధ్యక్షత వహించారు. ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం రూపంలో అందజేశారు. సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని అధికారులు తెలియజేశారు. ప్రతి సోమవారం ఈ గ్రీవెన్స్ డే జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎంపీడీవో కోరారు.