SI BANDI RAJESH: 130 నాటు కోళ్లు మృతి

సిరా న్యూస్, కరీంనగర్
130 నాటు కోళ్లు మృతి
*సంఘ‌ట‌నా పై పోలీసుల ఆరా…
*విష ప్రయోగంతో కోళ్లను మృతి చెందిన‌ట్లు అనుమానాలు..

130 నాటు కోళ్లు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన వీరమల్ల కుమార్ (41) తండ్రి మల్లయ్య అనే రైతు గత 2 సంవత్సరాల నుండి తన మూడు ఎకరాల వ్యవసాయ బావి వద్ద కోళ్ల ఫారం నిర్మించుకొని నాటు కోళ్లు పెంపకం చేస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి కోళ్ల ఫారం వద్ద నిద్రించేవాడు. మంగళవారం మాత్రం సాయంత్రం కోళ్లకు దాన వేసి ఇంటికి వెళ్ళాడు.బుధవారం ఉదయం తిరిగి కోళ్ల ఫారం వద్దకు వచ్చేసరికి 130 కోళ్లు మృతి చెందినట్లు తెలిపారు. బోరున విలిపించి కన్నీటి పర్యంతమయ్యాడు. స్థానిక ఎస్సై బండి రాజేష్ కు సమాచారం అందించగా సంఘటన స్థలం కోళ్లఫారాన్ని సందర్శించి పరిశీలించారు.ప్రాథమిక దర్యాప్తులో భాగంగా గుర్తు తెలియని వ్యక్తులు మందు కలిపిన బియ్యం కోళ్లకు చల్లదాంతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. వీరమల్ల కుమార్ భార్య వీరమళ్ల లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.గ్రామంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు.మండల పశువైద్యాధికారి శ్రీధర్ మందు కలిపిన బియ్యాన్ని పరిశోధన నిమిత్తం ల్యాబ్ కీ కరీంనగర్ పంపించారు. మందు కలిపిన బియ్యం ద్వారా చనిపోయా.? లేక ఎవరైనా అనుమానితులు చేశారా.. అనేవి తెలియాల్సి ఉంది.
ప్రభుత్వం ఆదుకోవాలి…
*వీరమల్ల కుమార్ (బాధితుడు)
మహిళాశ్రీనిధి లోన్ లో 8 లక్షల రూపాయలు తీసుకొని కోళ్ళ పారం షెడ్డు ను నిర్మించుకొని కోళ్ళ పెంపకం చేస్తున్నాను.కోళ్లు చనిపోవడంతో 3 లక్షల రూపాయల వరకు నష్టం జరిగింది బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. త‌న‌ను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *