సిరా న్యూస్,చిగురుమామిడి
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత : ఎస్సై బండి రాజేష్
* ప్రభుత్వ ఉద్యోగులపై సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రామంచ మోయా తుమ్మెద వాగులో మంగళవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు చిగురుమామిడి ఎస్సై బండి రాజేష్ తెలిపారు.ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం అనుమతులు తీసుకొని ఇసుక తీసుకోవాలని తెలిపారు.అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అభియోగాలు, వదంతులు సృష్టించడం ఏలాంటి నిరాధారమైన అంశాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.