సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఖానాపూర్లో రెండు ఇండ్లలో చోరీ : ఎస్సై జి. లింబాద్రి
తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలో చోరీ జరిగింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఖానాపూర్ ఎస్సై జి. లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం..విద్యానగర్ కాలనీకి చెందిన కాగజ్ నగర్ కు చెందిన జడల కుమారస్వామి అనునతను శుక్రవారం ఉదయం 6 గంటలకు తన ఇంటికి తాళం వేసి కాగజ్నగర్కు వెళ్లారు. రాత్రి గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో నగదు ఒక లక్ష యాభై వేల రూపాయలు దొంగలించారు. అదేవిధంగా పక్క పోర్షన్లో ఉంటున్న భుఖ్య జాను బాయి – రమేష్ ఆమె ఇంట్లో కూడా తాళాలు పగలగొట్టి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న కాళ్ల పట్టిలు ( సుమారు రూ.3200) విలువ గలవి దొంగలించారు.అదేవిధంగా కొంత దూరంలో ఉన్న ఇంట్లో రెండు ఫోర్షన్లో కూడా దొంగతనానికి ప్రయత్నించారు. కానీ ఆ ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు గాని నగదు గాని దొంగలించలేదు. జడల కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఇంటిని వదిలేటప్పుడు గాని, పండగలకు గాని తమ బంధువుల ఇండ్లకు గాని వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులను, నగదు ఉంచకుండా తమ వెంట తీసుకువెళ్లాలని, పోలీస్ స్టేషన్ కి వచ్చి సమాచారం ఇవ్వాలని ఎస్సై, జి లింబాద్రి కోరారు.