SI Purushothamm: రూ. 306300 నగదు పట్టివేత

సిరా న్యూస్, జైనథ్:

రూ. 306300 నగదు పట్టివేత

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని భోరజ్‌ ఎక్స్‌ రోడ్‌ సమీపంలో మ్యాక్స్‌ పికప్‌ వహానంపై ఇచ్చోడ నుండి జైనథ్‌కు వెళ్తున్న పి శ్రీనివాస్‌ అనే వ్యక్తి నుండి రూ. 306300 నగదును సీజ్‌ చేసినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. సోమవారం ఎక్స్‌ రోడ్‌ వద్ద వహానాల తనిఖీ నిర్వహిస్తుండగా, ఎలాంటి రసీదు లేకుండా డబ్బులతో వస్తున్న శ్రీనివాస్‌ వద్ద నుండి నగదు సీజ్‌ చేసామని ఆయన అన్నారు. అనంతరం ఎఫ్‌ఎస్‌టీ టీం కు సమాచారం అందించి, నగదును ఎఫ్‌ఎస్‌టీ టీం అధికారి ముత్యం రావ్‌కు అప్పగించినట్లు తెలిపారు. కాగా పంచనామ, సీజర్‌ రిపోర్ట్‌ సిద్ధం చేసి నగదును ట్రెజరీలో జమ చేసినట్లు ముత్యం రావ్‌ తెలిపారు. ఈ దాడుల్లో ఏఎస్సై సిరాజ్, కానిస్టేబుల్‌ అనిల్, విడియోగ్రాఫర్‌ నరేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై పురుషోత్తం మాట్లాడుతూ… రూ. 50వేలకు మించిన నగదుతో ప్రయాణించే వారు రసీదును వెంట పెట్టుకోవాలని సూచించారు. ఎలాంటి పత్రాలు లేకుండా నగదుతో పట్టుబడితే సీజ్‌ చేస్తామని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం, డీఎస్పీ ఎల్‌ జీవన్‌ రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు పకడ్బందీగా చేపడుతున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *