సిరాన్యూస్, ఖానాపూర్
ఐదు లీటర్ల నాటు సారా పట్టివేత : నిర్మల్ ఎక్సైజ్ ఎస్సై వసంత్ రావు
నిర్మల్ జిల్లాలో కడెం మండలంలో శనివారం ఐదు లీటర్ల నాటుసారాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నిర్మల్ ఎక్సైజ్ ఎస్సై వసంత్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ సి.నర్సింహారెడ్డి ఆదేశాల మేరకు శనివారం కడెం మండలంలో నర్సాపూర్, మాసైపేట్, ఎల్లాపూర్, లక్ష్మి సాగర్, కొత్త మద్దిపడగా గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించారు. ఈదాడుల్లో 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని 2000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. నాలుగు కేసులు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో ఏసి ఎన్ఫోర్స్మెంట్ సీఐ, అక్బరహుస్సేన్ , సిబ్బంది , వెంకటేష్, ఇర్ఫాన్ ముత్యం, భాస్కర్, కల్పనా పాల్గొన్నారు.