కారుతో బైక్ ని డి కొట్టి ఆ తరువాత కాల్పులు
రక్తపు మడుగుల్లో రౌడీ షీటర్ మృతి
సిరా న్యూస్,రంగా రెడ్డి;
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంచన్ బాగ్ చెందిన రౌడీ షీటర్ రియాజ్ (45) ను దుండగులు దారుణంగా హతమార్చారు. పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలాపూర్ ఆర్సీఐ రోడ్డు లో బైక్ ని కార్ తో డీ కొట్టి కాల్పులు జరిపి హతమార్చారు. ఘటనా స్థలం వద్ద బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబుసంఘటన స్థలాన్ని పరిశీలించారు. సి పి సుధీర్ బాబు మాట్లాడుతూ రియాజ్ పై బాలాపూర్ తో పాటు హైదరాబాద్ సిటీలో పలు కేసులు రౌడీ షీట్ ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం అతను మీర్పేట్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాడు. హత్య గల కారణాలు తెలియాల్సి ఉంది అని కేస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది అని తెలిపారు