రాజ్ భవన్ ముట్టడి

నీట్ పరీక్ష పై కొనసాగుతున్న ఆందోళన..
 సిరా న్యూస్,హైదరాబాద్;
నీట్ పరీక్ష ను రద్దు కోరుతూ బి.ఆర్.ఎస్.వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి జరిగింది. దాంతో పోలీసులు బి.ఆర్.ఎస్.వి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.తరువాత వారిని
ఎస్.ఆర్.నగర్ పి.ఎస్ కి తరలించారు. గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కేంద్ర మంత్రులు గా ఉన్న కిషన్ రెడ్డి , బండి సంజయ్ లు నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదు..? గవర్నర్ చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని అన్నారు.బి.ఆర్.ఎస్.వి రాష్ట్ర నాయకులు తుంగ బాలు మాట్లాడుతూ వెంటనే నీట్ పరీక్ష ను రద్దు చేయాలి. దీనిపై వెంటనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ స్పందించక పోతే రాబోయే రోజులలో బి.ఆర్.ఎస్.వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *