మరమలైనగర్‌ సమీపంలో సిగ్నల్‌ లోపం

ఒకే ట్రాక్‌పై నాలుగు సబర్బన్‌ రైళ్లు..తప్పిన ఘోర ప్రమాదం
సిరా న్యూస్,చెన్నై;
చెంగల్పట్టు జిల్లా మరమలైనగర్‌ సమీపంలో ఒకే ట్రాక్‌పై నాలుగు సబర్బన్‌ రైళ్లుఒకదాని వెనుక ఒకటి అతి దగ్గరగా ఆగిన సంఘటన కలకలం రేపింది. సాంకేతికలోపం కారణంగా సిగ్నల్‌ పనిచేయకపోవడంతో ఈ తప్పిదం జరిగిందని రైల్వే భద్రతా విభాగం అధికారులు తెలిపారు. రాజధాని నగరం చెన్నై నుంచి పొరుగు జిల్లాలైన చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్‌ జిల్లాలకు ప్రతిరోజు నడుపుతున్న సబర్బన్‌ రైళ్లలో వేలాది మంది ప్రయాణం చేస్తున్నారు. చెన్నై బీచ్‌-తాంబరం-చెంగల్పట్టు మధ్య నాలుగు రైలు మార్గాలున్నాయి. వీటిలో రెండు మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, మిగతా రెండు మార్గాల్లో సబర్బన్‌ రైళ్లు నడుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *