సిరా న్యూస్,పెంబి
సిరా న్యూస్కు స్పందన
* నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలి
* పెంబీ వీడీసీ సభ్యులు
* వీడీసీ అధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం
నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణం చేపడుతున్న పనులను తక్షణమే నిలిపి వేయాలని వీడీసీ సభ్యులు అన్నారు. ఇటీవల సిరా న్యూస్ పెంబిలో రూ.కోటి విలువ చేసే జీపీ స్థలం కబ్జా.! అనే శీర్షిక ప్రచురితమైంది. స్పందించిన నిర్మల్ జిల్లాలోని పెంబి వీడీసీ సభ్యులు ఈవిషయంపై శనివారం కలెక్టకు వినతి పత్రం ఇచ్చారు. ఈసందర్భంగా వారు మాట్లాడారు. పెంబి మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమపాఠశాల సమీపంలోని ప్రభుత్వ మంచి నీటి బావి వద్ద ఉన్న గ్రామ పంచాయతి పరిదిలోని భూమి సర్వే నెం. (278) గల దానిని పెంబి గ్రామానికి చెందిన అప్పటి టీఆర్ ఎస్ నాయకులు పుప్పాల శంకర్ తండ్రి చిన్నయ్య ఖానాపూర్ నివాసి, అబ్దుల్ ఖలీల్ తండ్రి బాబు అనే వ్యక్తులు, వారి యొక్క సర్వె నెం. 317 కు భదులు సర్వె నెం. 278 లో పైన పేరోన్న వ్యక్తులు రాజకీయ అండతో కమర్షియల్ భమనము నిర్మిస్తున్నారన్నారు. ఈ భూమికి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మండల సర్వేయర్, జిల్లా, సర్వేయర్ ద్వారా, గ్రామ పంచాయతి అనుమతి లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ భూమిని తమకు సంబందించిన భూమిగా, నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు. భూమి పత్రాలకు ఎలాంటి సంభందం లేదని ఈ నిర్మాణంను తక్షణమే నిలిపి వేసి వారిపై తగు చర్యలు తీసుకొని కోరారు. గ్రామ అభివృద్ధి కమిటికి అప్పగించి, ప్రభుత్వ పరంగా ప్రజా అవసరాల కోసం కొరకు ఉపయోగించాలని కోరారు.వీడీసీ సభ్యులు నర్సయ్య రాజలింగు గణధర్ పాల్గొన్నారు.