Sitakka: మంత్రి సీత‌క్క ఆధ్వ‌ర్యంలో ప‌లువురి కాంగ్రెస్‌లో చేరిక‌

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
మంత్రి సీత‌క్క ఆధ్వ‌ర్యంలో ప‌లువురి కాంగ్రెస్‌లో చేరిక‌

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమ‌వారం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కాంగ్రెస్ కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో చేరిక‌ల సంద‌డి నెల‌కొంటోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని న‌లుమూల‌ల నుండి ప్ర‌తీ రోజు చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ రామ్ న‌గ‌ర్ కు చెందిన నలగంటి నవీన్ ,అయిండ్ల శశికాంత్ ,ఇర్లా దయాకర్ కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి సీత‌క్క స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. సీతక్క వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కంది శ్రీ‌నివాస రెడ్డి నేతృత్వంలో పార్టీ బ‌లోపేత‌మ‌వుతుంద‌ని , రానున్న ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించేందుకు ఇది తోడ్పడుతుంద‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *